గచ్చిబౌలిలో విషాదం..మహిళ పై అత్యాచారం..ఆ తర్వాత హత్య !

-

గచ్చిబౌలిలో విషాదం చోటు చేసుకుంది. గచ్చిబౌలి పీయస్ పరిధిలో ఓ వివాహితపై అత్యాచారం ఆపై హత్య చేసారు కొంత మంది దుండగులు. ఈ సంఘటన ఇవాళ వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… నానక్ రాంగూడ ఫైనాన్సిషయల్ డిస్ట్రిక్ట్ లోని ఓ నిర్మాణ సంస్థలో మహిళ పై అత్యాచారం చేశారు కొంత మంది దుండగులు.

ఆ తర్వాత హత్య కూడా తెగబడ్డారు. గౌలిదొడ్డి కేశవనగర్ వడ్డెర బస్తీ కీ చెందిన మహిళగా గుర్తించారు పోలీసులు. కాశమ్మ w/o సాంబయ్య 38 అని తెలిపారు. వేస్ట్ మెటీరియల్ తీసుకొవడానికి శుక్రవారం నిర్మాణ సంస్థ కు వచ్చిన మహిళను రేప్ చేసి అనంతరం బండరాయి తో మోదీ చంపారు గుర్తు తెలియని దుండగులు. ఇక శుక్రవారం గచ్చిబౌలి పీయస్ లో మిస్సింగ్ కేసు నమోదు అయింది.మృతురాలికి ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ ఉన్నారని సమాచారం. ఇక దీనిపై కేసు నమోదు చేసుకుని.. ఆ దుండగుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news