క‌స్తూర్భా ట్ర‌స్ట్ నుంచి 14 మంది యువ‌తుల ప‌రారీ

-

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని గండిపేట మండ‌లం హైద‌ర్షాకోట్‌లోని క‌స్తూర్బాగాంధీ స్మార‌క ట్ర‌స్ట్ నుంచి 14 మంది యువ‌తులు శుక్ర‌వారం అర్థ‌రాత్రి ప‌రార్ అయ్యారు. స్మారక ట్ర‌స్ట్ మేనేజ‌ర్‌ నార్సింగి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. న‌గ‌రంలో వివిధ పోలీస్ స్టేష‌న్ల ప‌రిధిలో పట్టుబ‌డిన యువ‌తులు, మ‌హిళ‌లు క‌స్తూర్బాగాంధీ స్మార‌క ట్ర‌స్ట్‌లో చేర్చుతారు. పూర్తి భ‌ధ్ర‌త మ‌ధ్య ఓ హాల్‌లో 18 మందిని ఉంచారు.

అయితే శుక్ర‌వారం తెల్ల‌వారుజామున 2 గంట‌ల స‌మ‌యంలో బాత్‌రూంలో కిటికి ఊచ‌లు క‌ట్ చేసి 15 మంది పారిపోయేందుకు య‌త్నించారు. ఈ త‌రుణంలో ఓ యువ‌తికి స్వ‌ల్ప‌గాయం కావ‌డంతో అక్క‌డే ఉండిపోయింది. మిగ‌తా 14 మంది యువ‌తులు పరారయ్యారు. ఈ విష‌యాన్ని ఉద‌యం గుర్తించిన మేనేజ‌ర్ రామ‌కృష్ణ నార్సింగి పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. పారిపోయిన వారిలో ఎక్కువ‌గా మ‌హారాష్ట్ర, బెంగాల్‌కు చెందిన ఉన్నారు. వీరి కోసం రెండు పోలీస్ బృందాల‌ను ఏర్పాటు చేసి గాలింపులు కొన‌సాగిస్తున్న‌ట్టు అడ్మిన్ ఎస్ఐ ర‌వీంద‌ర్ వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Latest news