Telangana: ఆర్టీసీ బస్సు ఢీకొని బైక్‌పై వెళ్తున్న ఒకరు మృతి

-

Telangana: ఆర్టీసీ బస్సు ఢీకొని బైక్‌పై వెళ్తున్న ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన మానకొండూరు లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మానకొండూర్ శంకరపట్నం మండలంలోని చింతగట్టుకు చెందిన మామ అల్లుళ్ళు ఆంజనేయులు(33), హరీశ్ జమ్మికుంటలోని బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి బైక్‌పై వెళ్లారు.

A person riding a bike was killed after being hit by an RTC bus

తిరిగి స్వగ్రామం వెళ్తుండగా కేశవపట్నం బస్టాండ్ వద్ద సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బైక్‌పై వెనకాల కూర్చున్న ఆంజనేయులు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. హరీశ్ క్షేమంగా బయటపడ్డాడు.

Read more RELATED
Recommended to you

Latest news