తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎస్సై, కానిస్టేబుల్ మృతి చెందారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురం వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. లారీని వెనుక నుంచి కారు వచ్చి ఢీకొట్టింది.

ఏ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన వారు కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్సై అశోక్, మరొకరు కానిస్టేబుల్గా గుర్తించారు. గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
https://twitter.com/TeluguScribe/status/1938069460545310862