కామారెడ్డి వింత ఘటన… హుండీ లో ఇరుక్కున్న దొంగ చెయ్యి !

-

కామారెడ్డి జిల్లాలో వింత సంఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి హుండీ లో ఓ దొంగ చెయ్యి ఇరుక్కుంది. భిక్కనూరు మండలం రామేశ్వర పల్లి లోని మాసు పల్లి పోచమ్మ ఆలయం లో ఈ ఘటన చోటు చేసుకుంది. రామేశ్వర పల్లి లోని మాసు పల్లి పోచమ్మ ఆలయం లో పని చేసే సురేష్ .. హుండీ చోరికి యత్నం చేశాడు.

a thief stuck in a hundi

హుండీలో డబ్బులు తీసేందుకు చేయి పెట్టాడు ఆలయం లో పని చేసే సురేష్. అయితే…ఈ నేపథ్యంలోనే… హుండీలో చేయి ఇరుక్కుని నరకయాతన అనుభవించాడు సురేష్‌. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు గ్రామస్థులు. అనంతరం నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు…దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news