BREAKiNG : మునుగోడు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన ఏఐసీసీ

-

BREAKING : మునుగోడు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది ఏఐసీసీ. కాసేపటి క్రితమే.. మునుగోడు ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని నిలబెడుతున్నట్లు అధికారిక ప్రకటన చేసింది కాంగ్రెస్‌ పార్టీ. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా ఇచ్చింది ఏఐసీసీ.

మునుగోడు నియోజకవర్గానికి దాదాపు 20 ఏళ్లకు పైగా ఎమ్మెల్యేగా పని చేసిన పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి.. కూతురే ఈ పాల్వాయి స్రవంతి. మునుగోడు ఉప ఎన్నిక టికెట్‌ కోసం.. పాల్వాయి స్రవంతి, కృష్ణా రెడ్డి పోటీ పడ్డప్పటికీ.. కాంగ్రెస్‌ అధిష్టానం మాత్రం..పాల్వాయి స్రవంతికే మొగ్గు చూపింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వకపోవడంతో.. స్వతంత్ర్య అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి.. బరిలోకి దిగి… 25 వేల పై చిలుకు ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో నిలించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news