రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలి – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

-

రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై భువనగిరి కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చాలని కోరుతూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. రీజినల్ రింగ్ రోడ్డు సర్వే నిర్వహిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.

హద్దురాళ్ళు నాటితేే తొలగించాలని బాధితులకు సూచించారు. కెసిఆర్ ఒక్కడు బాగుంటే బంగారు తెలంగాణ కాదని.. పేదవాళ్ల ఆస్తులు కాపాడినప్పుడే బంగారు తెలంగాణ అవుతుందని అన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వ భూములనుంచి రీజినల్ రింగ్ రోడ్ నిర్మించేలా చూడాలన్నారు. రెండు మూడు కోట్లకు ఎకరం భూమి విలువ ఉందని.. దానికి అనుగుణంగా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news