కాగజ్ నగర్​, నిజామాబాద్ లలో నేడు అమిత్ షా ఎన్నికల ప్రచారం

-

ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మల్కాజిగిరి బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తరపున నిర్వహించే సభల్లో పాల్గొననున్నారు. మొదట ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని ధర్మవరంలో ఎన్నికల ప్రచారం చేస్తారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి మధ్యాహ్నాం 1:50 గంటలకు చేరుకుంటారు.

బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్​నగర్​కు మధ్యాహ్నాం 3:05 గంటలకు చేరుకోని.. ఆదిలాబాద్‌ కమలం పార్టీ లోక్‌సభ అభ్యర్థి గోడెం నగేష్‌కు మద్దతుగా ఎస్పీఎం క్రికెట్‌ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. మధ్యాహ్నాం 3:20 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 40 నిమిషాల పాటు సభలో ఉంటారు.

కాగజ్‌నగర్‌లో సభ ముగించుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నిజామాబాద్‌కు సాయంత్రం 5 గంటలకు అమిత్ షా చేరుకుంటారు. నిజామాబాద్‌ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి, ఎంపీ ధర్మపురి ఆర్వింద్‌కు మద్దతుగా గిరిరాజ్‌ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో సాయంత్రం 5:10 గంటల నుంచి సాయంత్రం 5:50 గంటల వరకు అమిత్ షా ఉండనున్నారు. నిజామాబాద్‌ సభ ముగించుకున్నాక  రాత్రి 6:50 గంటల నుంచి రాత్రి 7:35 గంటల వరకు సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news