నేడు తెలంగాణకు అమిత్ షా రాక

-

కేంద్ర హోం శాఖమంత్రి అమిత్‌ షా నేడు తెలంగాణకు వస్తున్నారు. ఇవాళ రాత్రి 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌కు వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేసి శనివారం ఉదయం అల్పాహారం అనంతరం 10.30 గంటలకు సోమాజిగూడలోని క్షత్రియ హోటల్​కు చేరుకుంటారు. అక్కడ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారు. అనంతరం మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తారు.

ఈ కార్యక్రమం అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో అమిత్ షా గద్వాల్‌కు వెళ్తారు. మధ్యాహ్నం 12:45 గంటల నుంచి 1.20వరకు గద్వాల, 2.45 నుంచి 3.20 గంటల వరకు నల్గొండ, సాయంత్రం 4.10 నుంచి 4.45 గంటల వరకు వరంగల్​లో నిర్వహించే సకల జనుల విజయ సంకల్ఫ సభల్లో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు. వరంగల్ పర్యటన అనంతరం బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్ కు 6.10 గంటలకు చేరుకుంటారు. అనంతరం రాత్రి 7 గంటల నుంచి 7.45 వరకు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో ఎమ్మార్పీఎస్ నేతలతో అమిత్‌ షా సమావేశమవుతారు. సమావేశం అనంతరం అక్కడి నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని… రాత్రి 8: 15 గంటలకు ప్రత్యేక విమానంలో దిల్లీకి తిరుగు పయనమవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news