రేపు హైదరాబాద్ కి అమిత్ షా.. రాజమౌళితో భేటీ

-

కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఖమ్మం సభ కోసం అమిత్ షా రేపు సాయంత్రమే హైదరాబాద్ కి చేరుకోనున్నారు. ఈ క్రమంలో శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో దర్శకుడు రాజమౌళితో పాటు మరో ఇద్దరు సినీ ప్రముఖులతో అమిత్ షా భేటీ అవుతారని సమాచారం. ఖమ్మంలో 15వ తేదీన బిజెపి నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు అమిత్ షా రావాల్సి ఉంది. అయితే ఆ సమావేశానికి ఒక రోజు ముందే రాష్ట్రానికి రానున్నారు షా. ఈ పర్యటనలో నాలుగు రంగాలకు చెందిన ప్రముఖులతో అమిత్ షా సమావేశం కానున్నట్లు బిజెపి వర్గాలు చెబుతున్నాయి.

అయితే రాజమౌళితో సహా అమిత్ షా తో భేటీ అయ్యే మరో ఇద్దరు ఎవరనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. గతంలో హైదరాబాద్ కి వచ్చిన అమిత్ షా తో నితిన్, జూనియర్ ఎన్టీఆర్ లు భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక వీరితో భేటీ అనంతరం తరువాతి రోజున ప్రత్యేక హెలికాప్టర్ లో ఉదయం భద్రాచలం వెళ్లి అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలో పాల్గొంటారు షా. ఆ తరువాత లంచ్ అనంతరం ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Latest news