గుమ్మడికాయ తింటే వాతం చేస్తుందా..? ప్రపంచంలో మేధావులు అంతా ఇదే ఎందుకు తింటున్నారు.?

-

అసలు మనం చిరుతిండ్లుగా టాక్లెట్లు, బిస్కెట్లు, జమ్స్, చిప్స్‌ ఇవి తింటూ పెరిగాం.. అందుకే ఇలానే ఉన్నావేమో కదా..! రోగనిరోధక శక్తి తక్కువగా, నీరసంగా.. అందరిలో మనం ఒకళ్లలాగానే ఉండిపోయాం. చిన్నప్పుడు నుంచే మంచి ఆహారం తింటుంటే బ్రెయిన్‌ షార్ప్‌గా అయ్యేదేమో. సరే ఇప్పుడు మళ్లీ చిన్నగా అవ్వలేం కదా..? కనీసం ఇప్పుడైనా మంచి పోషకాలు ఉన్న ఆహారం తినొచ్చుగా..! ఇంకా ఆ పానీపూరీలు, పిజ్జా, బర్గర్లు ఎందుకు.. అవి తినడం అనవసరమైన రోగాలను కొని తెచ్చుకోవడం.! అసలు ప్రపంచంలో మేధావులు అందరూ తినే ఆహారం ఏంటో తెలుసా..? గుమ్మడిగింజలు. చాలామంది తెలివైన వాళ్లు డైలీ గుమ్మడిగింజలు తింటారని అధ్యయనాలు సైతం నిరూపించాయి.

గుమ్మ‌డిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. దీనిలో 92 శాతం నీరు ఉంటుంది. అలాగే 100 గ్రాముల గుమ్మ‌డికాయ‌లో 25 క్యాల‌రీల శ‌క్తి మాత్ర‌మే ఉంటుంది. అలాగే దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి కూడా మెరుగుప‌డుతుంది. ఇది సుల‌భంగా జీర్ణ‌మ‌వుతుంది.

గుమ్మడికాయ తింటే వాతం చేస్తుందా..?

మ‌న ఆరోగ్యానికి మేలు చేసిన‌ప్ప‌టికి గుమ్మ‌డికాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వాతం చేస్తుంద‌ని చాలా మంది భావిస్తూ ఉంటారు. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మంపైదుర‌దలు, దద్ద‌ర్లు కూడా వ‌స్తాయ‌ని అనుకుంటూ ఉంటారు. అయితే గుమ్మ‌డికాయ‌లో వాతం చేచ‌సే గుణం లేద‌ని దానిని వండే విధానం వ‌ల్ల గుమ్మ‌డికాయ వాతం చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. గుమ్మ‌డికాయ‌తో ఎక్కువ‌గా పులుసును త‌యారు చేస్తూ ఉంటారు. పులుసు కూర‌లు వండ‌డానికి చింత‌పండును ఉప‌యోగిస్తారు. చింత‌పండు వేసిన కార‌ణంగా వంట‌ల్లో ఉప్పు, కారం, మ‌సాలాలు ఎక్కువ‌గా వేయాల్సి వ‌స్తుంది. ఉప్పుకు వాతం చేసే గుణం ఉంది.. దీని కారణంగా గుమ్మ‌డికాయ‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు వాతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉప్పుకు అల‌ర్జీ చేసే గుణం కూడా ఉంది.గుమ్మ‌డికాయ కూర‌లో వేసే ఉప్పు వాతం చేస్తుంద‌ని కానీ గుమ్మ‌డికాయ వాతం చేయ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. చింత‌పండు, ఉప్పు వేయ‌కుండా చేసే గుమ్మ‌డికాయ వంట‌కాల‌ను తిన‌డం వల్ల ఎటువంటి వాతం చేయ‌ద‌ని వారు సూచిస్తున్నారు. చింత‌పండుకు బ‌దులుగా ప‌చ్చి చింత‌కాయ‌లు, ప‌చ్చి మామిడికాయ‌లు, ట‌మాట ర‌సం వేసి గుమ్మ‌డికాయ పులుసును చేసి తీసుకోవ‌డం వ‌ల్ల ఎటువంటి వాతం చేయ‌ద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

గుమ్మడి గింజలు తింటే..

గుమ్మ‌డి కాయ‌తో పాటు గుమ్మ‌డి గింజ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. గుమ్మ‌డి గింజ‌లు దాదాపు జీడిప‌ప్పుతో స‌మానం. గుమ్మ‌డి గింజ‌ల్లో ఉండే ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల జింక్ అత్య‌ధికంగా ఉంటుంది. ఈ గుమ్మ‌డి గింజ‌ల ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. తెలివితేట‌లు, జ్ఞాప‌క శ‌క్తి పెర‌గ‌డంతో పాటు వృద్దాప్యంలో మ‌తిమ‌రుపు, అల్జీమ‌ర్స్ వంటి స‌మ‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి. ఈ ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల ఆలోచ‌న శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. ఈ విధంగా గుమ్మ‌డి కాయ‌తో పాటు గుమ్మ‌డి గింజ‌లప‌ప్పు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు అంటున్నారు. ఎదిగేపిల్లలు రోజు ఉదయం నానపెట్టిన గుమ్మడిగింజలు ఒక స్పూన్‌ ఇవ్వడం అలవాటు చేయండి. రిజల్ట్‌ మీరే చూస్తారు.!

Read more RELATED
Recommended to you

Latest news