మహిళలకు నెలకు రూ.2,500పై నేడు ప్రకటన!

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత న ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకోనుంది రేవంత్ రెడ్డి కేబినెట్. ముఖ్యంగా మహిళా సాధికారిక అంశాలే ప్రధానంగా ఉండనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Revanth to Yadadri temple today

మహిళలకు నెలకు 2500 రూపాయలపై ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఎస్ హెచ్ జి మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ పునరుద్ధరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా 5 లక్షల రూపాయల జీవిత బీమా, కొత్త రేషన్ కార్డులపై నిర్ణయాలు తీసుకోనున్నారు రేవంత్ రెడ్డి. సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో జరిగే మహిళా శక్తి సభలో వీటిపై ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news