తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్ ఫీజు చెల్లించేందుకు మరో ఛాన్స్

-

తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్. పదో తరగతి ఎగ్జామ్ ఫీజు చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. తత్కాల్ పథకం కింద రూ. 10 తో వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్ష విభాగం కమిషనర్ కృష్ణరావు తెలిపారు. విద్యార్థులు ఈ నెల 15వ తేదీ వరకు నిర్ణిత ఫీజును ఆయా స్కూళ్ల హెడ్మాస్టర్ లకు చెల్లించాలని సూచించారు.

అలాగే , తెలంగాణ రాష్ట్రంలో తెలుగులో ఇకపై 20 మార్కులు వస్తేనే పాస్ అయినట్లు పేర్కొంది విద్యశాఖ. అయితే ఇది కొందరికి మాత్రమే అమలు అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో తెలుగును సెకండ్ లాంగ్వేజ్ ఉన్న పదవ తరగతి విద్యార్థులు ఇకపై వార్షిక పరీక్షలలో 20 మార్కులు సాధిస్తే పాస్ అయినట్లే.తెలుగు తప్పనిసరి చట్టం – 18లో భాగంగా ఇతర మీడియాలో చదివే విద్యార్థులు తెలుగులో కచ్చితంగా.. ఒక సబ్జెక్టుగా తీసుకోవడం అనివార్యమైంది.

 

Read more RELATED
Recommended to you

Latest news