BREAKING: అప్పుల బాధతో మరో ఖమ్మం రైతు ఆత్మహత్య !

-

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే.. తాజాగా అప్పుల బాధతో మరో ఖమ్మం రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డి మండలం జానకీపురం గ్రామానికి చెందిన పిట్టల లక్ష్మయ్య (40) తనకున్న 3 ఎకరాల పొలంతో మరికొంత భూమి కౌలు తీసుకొని వరి, పత్తి, మిర్చి పండిస్తున్నాడు.

అప్పుల పాలై దిగుబడి సరిగా రాకపోవడంతో పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.

ఇక అటు భట్టి విక్రమార్క అనుచరుల ఆగడాలతో పురుగుల మందు తాగి ఇటీవలే టీడీపీ కార్యకర్త, రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు రాజ్యం వస్తుందని నమ్మి కాంగ్రెస్ పార్టీకి వేస్తే నా పొలం ఆక్రమించుకొని నాకు అన్యాయం చేస్తున్నారని రైతు భోజడ్ల ప్రభాకర్ తీవ్ర మనస్తాపంతో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు.

Read more RELATED
Recommended to you

Latest news