BREAKING : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి నోటీసులు

-

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేయడమే కాకుండా.. హైదరాబాద్‌ పాతబస్తీలో అల్లర్లకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు మరోసారి హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీచ ఏశారు. ఒక్కే రోజు రెండు పోలీస్ స్టేషన్స్ నుండి రాజా సింగ్ కు నోటీసులు జారీ చేశారు.

41 crpc కింద షాహీనాథ్ గుంజ్ మరియు మంగల్ హాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తన పై తెలంగాణ పోలీసులు కుట్ర పనుతున్నారు అంటూ రాజా సింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఫిబ్రవరి, ఏప్రిల్ లో నమోదైన కేసుల పై ఇప్పుడు ఎందుకు నోటీసులు ఇస్తున్నారు అంటూ రాజా సింగ్ ప్రశ్నించారు. నన్ను అరెస్ట్ చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్నారని ఈ సందర్భంగా రాజాసింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు తెలంగాణ పోలీసులు నిద్ర పోతున్నారా అని నిలదీశారు రాజాసింగ్‌.

Read more RELATED
Recommended to you

Latest news