రాజాసింగ్‌ పై చర్యలు తీసుకోండి..స్పీకర్‌ను కోరిన ఓవైసీ

-

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ ఎంపి ఓవైసి. ఇటీవలే రాజా సింగ్ విడుదల చేసిన విడియో రిలీజ్ చేయడం వల్ల ముస్లిం ల మనోభావాలు దెబ్బతిన్నాయని… రాజాసింగ్ మహుమ్మద్ ప్రవక్త పై అభ్యంతర వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు.

దాని ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు పాతబస్తీ లో నిరసనలు వెల్లువెత్తాయి… శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని మండిపడ్డారు. తెలంగాణలో ప్రశాంత వాతావరణం ఉంది. బిజెపి వల్ల ప్రశాంతంగా ఉన్న నగరం అశాంతి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజా సింగ్ పై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. రాజా సింగ్ భవిష్యత్ లో ఇలాంటి వాక్యలు చేయకుండా ఉండాలంటే అతని పై కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్‌ చేశారు. ఓ ప్రజా ప్రతినిధి అయి ఉండి, రాజాసింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news