తెలంగాణ కార్మికులకు శుభవార్త..దళితబంధు తరహాలో మరో పథకం

-

తెలంగాణ కార్మికులకు కేసీఆర్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. రైతు బంధు, దళిత బంధు తరహాలోనే కార్మికుల కోసం త్వరలోనే ఓ కొత్త పథకం తీసుకువస్తామని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రకటన చేశారు. మేడే నేపథ్యంలో.. నిన్న రవీంద్ర భారతీలో కార్మికుల దినోత్సవాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల పక్షాన చిరంజీవి నిలబడాలని.. సినీ కార్మికులకు ధనవంతులను చేసే బాధ్యతను చిరంజీవి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

నేను ఓటీటీ సినిమాలు తీస్తా, స్టూడియోలు కడుతానని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కరోనాతో ప్రపంచమంతా అతలాకుతలమైందని.. కరోనా వల్ల నిర్మాతలకు డబ్బులు తక్కువగా వచ్చాయని పేర్కొన్నారు. కానీ కార్మికులు బాగా నష్టపోయారని… సినిమా కార్మికులంతా ఇప్పుడు అదృష్టవంతులు అని చెప్పారు. నా లాంటి వాళ్లను భాగస్వాములను చేసి ఓటీటీ లు పెట్టుకోవాలని కోరారు. సైకిల్ మీద పాలమ్ముకున్న నేను ఈ రోజు కార్మిక శాఖ మంత్రినయ్యానని.. కార్మికుల కోసం చిరంజీవి సినిమాలు తీయాలి, ఓటీటీలు పెట్టాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news