కార్యకర్తల కోలాహలం నడుమ ఎన్టీఆర్‌ భవన్‌కు సీఎం చంద్రబాబు

-

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఇవాళ నగరంలోని ఎన్టీఆర్‌ భవన్‌కు చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు వచ్చారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. దారి పొడవునా జై తెలుగుదేశం, జై చంద్రబాబు నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. కార్యకర్తలు, అభిమానుల కేరింతల నడుమ ఎన్టీఆర్ భవన్‌కు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారిగా ఎన్టీఆర్ భవన్కు చేరుకున్న చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ నేతలు సన్మానం చేశారు. అనంతరం కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడనున్నారు. శుక్రవారం సాయంత్రం కూడా హైదరాబాద్ వచ్చిన చంద్రబాబుకు భారీ ర్యాలీతో ప్రజలు స్వాగతం పలికిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news