నేడు కేసీఆర్‌ను పరామర్శించనున్న ఏపీ సీఎం జగన్

-

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించేందుకు ఆయన హైదరాబాద్ వస్తున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11:30 గంటలకు బంజారాహిల్స్‌లోని కేసీఆర్‌ నివాసానికి జగన్‌ చేరుకుంటారు. గంటపాటు అక్కడే ఉండి మధ్యాహ్నానికి తాడేపల్లి చేరుకుంటారు. ఈ గంట భేటీలో కేసీఆర్ ఆరోగ్య వివరాలను ఆరా తీయడంతో పాటు ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు, ఏపీలో ఎన్నికలు, రాజకీయాలపై స్వల్ప చర్చ జరగనున్నట్లు సమాచారం.

గత నెలలో కేసీఆర్‌ ప్రమాదవశాత్తు జారి పడడంతో ఎడమ తుంటికి వైద్యులు శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే. దాదాపు వారం రోజుల పాటు ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందారు. అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్‌ అయ్యారు. ఇక అప్పటి నుంచి కేసీఆర్ తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. పార్టీ కార్యకలాపాలను ఆయన ఇంటి వద్ద నుంచే చూసుకుంటున్నారు. మరికొన్ని నెలల్లో లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో త్వరలోనే కేసీఆర్ మళ్లీ రాజకీయ కార్యకలాపాలతో బిజీ కానున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news