బీజేపీ నేత జితేందర్ రెడ్డి మరో సంచలన ట్వీట్..ఊరకుక్కల్లారా అంటూ !

-

ఇవాళ ఏపీ జితేందర్ రెడ్డి సంచలన ట్వీట్‌ చేశారు. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఇలాంటి ట్రీట్‌మెంట్ అవసరం అంటూ బీజేపీ నేషనల్ ఎక్జిక్యూటివ్ మెంబర్ ఏపీ జితేందర్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. అయితే.. ఈ ట్వీట్‌ ను ఉద్దేశించి.. మరో ట్వీట్‌ చేశారు ఏపీ జితేందర్ రెడ్డి.

కేసిఆర్ సోషల్ మీడియా ఊరకుక్కలకు తెల్వాల్సిన ముచ్చట ఏంటిదంటే… బండి సంజయ్ గారి నాయకత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్నో చెప్పే ప్రయత్నాన్ని తప్పుగ అర్థం చేసుకునే ఊరకుక్కల్లార… బిస్కెట్ల కోసం బరితెగించకుర్రి అంటూ బీఆర్‌ఎస్‌ పార్టీకి చురకలు అంటించారు ఏపీ జితేందర్ రెడ్డి. ఇప్పుడు ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news