BREAKING : ఉదయం 11 గంటలకు గద్దర్ అంతిమ యాత్ర ప్రారంభం

-

అధికారిక లాంచనాలతో గద్దర్ అంత్యక్రియలు రేపు మహాబోధి విద్యాలయంలో జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గద్దర్ మృతికి సంతాపం ప్రకటించిన కేసీఆర్.. ఈ మేరకు సీఎస్ శాంతికుమారిని ముఖ్యమంత్రి ఆదేశించారు.

గద్దర్ అంతిమయాత్ర రూట్ మ్యాప్ సంబంధించిన వివరాలు

1. ఎల్బీ స్టేడియం నుంచి 12 గంటలకు అంతిమయాత్ర

2. గన్ పార్క్ , అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం, ట్యాంక్ బండ్ మీదుగా అల్వాల్ లోని నివాసం వరకు అంతిమయాత్ర

3. అల్వాల్ లోని నివాసం వద్ద కొద్దిసేపు పెడతారు.

4. నివాసం వద్ద నుంచి సమీపంలోని బోధి విద్యాలయం వరకు తీసుకెళ్లి అంత్యక్రియలు..

Read more RELATED
Recommended to you

Latest news