నిజామాబాద్ జిల్లాలో దారుణం.. హత్యకు గురైన బాలుడు 

-

నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూడు రోజు క్రితం చిట్టాపూర్ లో రాకేష్ (12) అదశ్యమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆ బాలుడు హత్యకు గురయ్యాడు. దీంతో ఈ బాలుడి   హత్య జరగడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాల్కొండ పోలీస్ స్టేషన్ లో ఈనెల 11న  మిస్సింగ్ కేసు నమోదు అయినట్టు పోలీసులు వెల్లడించారు. 

అయితే బాలుడి హత్యకు గల కారణాల పై పోలీసులు ఆరా తీస్తున్నారు. బండి నరేందర్ అనే వ్యక్తి పై అనుమానం ఉందని బాలుడి తల్లిదండ్రులు చెబుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.  మరో వైపు ఇవాళ ఉదయం కూడా మీ బాలుడు మా వద్ద ఉన్నాడు.. డబ్బులు కావాలని డిమాండ్ చేసినట్టు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. ఇక ఇంతలోనే ఈ బాలుడు హత్యకు గురికావడం గమనార్హం. వ్యాపార లావా దేవీల కోసమే ఈ బాలుడిని హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతామని వెల్లడించారు. 

Read more RELATED
Recommended to you

Latest news