అత్తాపూర్ లో దారుణం.. ఛాయ్ పెట్టనందుకు కోడల్ని చంపిన అత్త..!

-

రాష్ట్రంలో రోజు రోజుకు దారుణ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడూ ఏం జరుగుతుందో అస్సలు ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. కేవలం ఇవాళ ఒక్కరోజే మూడు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇంకా వెలుగులోకి రానికి ఎన్ని చోటు చేసుకున్నాయో మాత్రం తెలియదు. జగిత్యాల జిల్లాలో ఓ తల్లి, కూతురు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో దారుణంగా భర్తను గొడ్డలితి భార్య నరికి చంపింది.

తాజాగా అత్తాపూర్ లో మరో దారుణం చోటు చేసుకుంది. ఛాయ్ పెట్టనందుకు క్షణికావేశంతో ఓ మహిళ తన కోడలిని చంపేసింది. ఈ సంఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాసన్ నగర్ లో గురువారం జరిగింది. ఎసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ వెంకటరామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హసన్ నగర్ ప్రాంతంలో ఫర్జాన గురువారం ఉదయం  చాయ్ పెట్టి ఇవ్వమని కోడలు అజ్మీర బేగం(28) కి చెప్పింది. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో క్షణికావేశానికి గురైన జన చున్నీతో కోడలు మెడకు బిగించి ఉరివేసి చంపేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితురాలిని అరెసు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news