కేటీఆర్ బస్సు పై కోడిగుడ్లతో దాడి

-

నల్గొండ లో బీఆర్ఎస్ బహిరంగ సభకు వెళ్తున్న బస్సు పై ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు. నల్ల దుస్తులు ధరించి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో వీటీ కాలనీలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ బస్సులో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి లతో పాటు ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం.

నల్గొండలో కేసీఆర్ గో బ్యాక్ అంటూ ప్లకార్డులను పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కృష్ణా జలాల పరిరక్షణ కోసమే నల్గొండలో కేసీఆర్ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సభలో పాల్గొనేందుకు ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్తున్నారు. నల్గొండ పట్టణ శివారులో నార్కట్ పల్లి-అద్దంకి హైవేకి ఆనుకొని మర్రిగూడ బైపాస్ లో విశాలమైన స్థలంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ సభకు చేరుకునేందుకు మాజీ సీఎం కేసీఆర్ బయలుదేరారు. 

Read more RELATED
Recommended to you

Latest news