శంఖారావంలో నారా లోకేష్ కామెడీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ..!

-

పాతపట్నంలో తాజాగా శంఖారావం బహిరంగ సభ జరిగింది. ఈ సభలో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ మాట్లాడారు. జగన్ పై కామెడీ పంచ్ లు వేశారు. జగన్ కి నిజం చెబితే తల వంద ముక్కలు అవుతుందని అనే శాపం ఉందని.. అందుకే రోజుకో అబద్దం చెబుతున్నారని ఎద్దేవా చేశారు. మోసానికి షార్ట్ ఫాంట్ వేస్తే అచ్చం జగన్ మోమన్ రెడ్డిలా ఉంటుందని తెలిపారు. ఎన్నికల ముందు తియ్యగా మాయమాటలు చెప్పారని.. దొరికినా ప్రతీ మహిళకు ముద్దులు పెట్టారని.. ఇప్పుడు గట్టిగా గుద్దుతున్నారని ఆరోపించారు.

ఎన్నికల ముందు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ప్రతీ ఏడాది డీఎస్సీ ఇస్తామని మోసం చేశారని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ కాస్త సాక్షి క్యాలెండర్ అయిందని తెలిపారు. బీసీ, ఎస్సీ, స్టడీ సర్కిల్ మూసివేశారని.. పీజీ ఫీజు రిఎంబర్స్ మెంట్ ఎత్తేశారని.. విదేశీ విద్యను కట్ చేశారని ఆరోపించారు. అలాగే ప్రతీ ఏడాది 6500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని హామి ఇచ్చి ఈ రోజు జగన్ మాట తప్పారు అని తెలిపారు. ప్రస్తుతం జగన్ మీ బిడ్డని మీ బిడ్డని అంటున్నారని.. సీఎం మన బిడ్డ అవుతున్నారని జాలిపడవద్దని.. పొరపాటున రేపు ఎన్నికల్లో గెలిస్తే.. మీ బిడ్డను కనుక మీ భోమిలో వాటా ఇవ్వమని అడుగుతారని హాస్య చురకలు అంటించారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news