లోక్ సభ డిప్యూటీ స్పీకర్ అభ్యర్థి గా అయోద్య ఎంపీ..?

-

లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవికి సంబంధించిన ఎన్నికకు త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నికలోనూ తమ అభ్యర్థిని నిలిపే దిశగా విపక్ష ఇండియా కూటమి ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈక్రమంలోనే  బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కీలక ప్రతిపాదన చేసింది.

ఉత్తరప్రదేశ్ లో అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్ లోక్ సభ స్థానం నుంచి గెలిచిన సమాజ్వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్ పేరును ఇండియా కూటమి డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిత్వం కోసం పరిశీలించాలని కోరింది. దళిత వర్గానికి చెందిన బలమైన నేతగా పేరొందిన అవధేష్ ప్రసాదు ఈ ప్రతిష్టాత్మక ఎన్నికలో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని టీఎంసీ పేర్కొంది. ఫైజాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్పై 50వేల పైచిలుకు ఓట్ల తేడాతో అవధేష్ ప్రసాద్ గెలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news