బీఆర్ఎస్ అభ్యర్థులకు నేడూ బీఫారాల పంపిణీ

-

తెలంగాణలో ఎన్నికల హడావుడి షురూ అయింది. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసింది. అయితే తొలిరోజు 69 మందికి మాత్రమే బీ ఫారాలు అందజేయగా.. మిగతా వారికి ఇవాళ అందజేయనున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫారాల పంపిణీ నేడూ కొనసాగనుంది.

ఆదివారం ఉదయం 51 మందికి బీఫారాలు ఇచ్చిన కేసీఆర్‌ హుస్నాబాద్ సభ నుంచి తిరిగి వచ్చిన తర్వాత.. ప్రగతిభవన్‌లో మరో 18 మందికి అందించారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు మిగతా నియోజకవర్గాల్లోని అభ్యర్థులకు… నేడు ప్రగతిభవన్‌లో బీ ఫారాలు అందజేయనున్నారు. ఒకరిద్దరు అభ్యర్థులను మారుస్తారనే ప్రచారం సాగుతోంది. పెండింగ్‌లోని నాలుగు స్థానాల అభ్యర్థులపై నేడు స్పష్టత రానున్నట్లు సమాచారం. జనగామ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి బీఫారం ఇచ్చారు.

నర్సాపూర్, మల్కాజిగిరి, గోషామహల్, నాంపల్లి అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మల్కాజిగిరికి మర్రి రాజశేఖర్ రెడ్డి, నర్సాపూర్ సునీత లక్ష్మారెడ్డి, గోషామహల్ నందకిషోర్ వ్యాస్, నాంపల్లి ఆనంద్ కుమార్ గౌడ్‌కు నేడు బీఫారం ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. . బీ ఫారం, నామినేషన్, అఫిడవిట్ల దాఖలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను స్వయంగా కేసీఆర్ అభ్యర్థులకు వివరించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news