మెదక్లో రెండో రోజు కొనసాగుతున్న బంద్

-

గోవుల రవాణాను కొందరు అడ్డుకోవడంతో మొదలైన పంచాయితీ పెద్దదై ఇరువర్గాల మధ్య గొడవకు దారి తీసిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీంతో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్​, పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్​లను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి అరెస్టులను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ బజరంగ్​ దళ్​ హిందూ వాహిని బీజేవైఎం పట్టణ బంద్​కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రెండో రోజు ఈ బంద్ పట్టణంలో ప్రశాంతంగా కొనసాగుతోంది.

బంద్​లో భాగంగా మెదక్ పట్టణంలో అత్యవసర సేవలు మినహా పలు వ్యాపార సంస్థలు, హోటళ్లు, పెట్రల్​ పంపులు స్వచ్ఛందంగా బంద్​ చేశాయి. రెండో రోజు ప్రశాంతంగా బంద్​ కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పలు కూడళ్ల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news