మరో 6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు : బండి సంజయ్

-

మరో ఆరు నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ కమిటీ సమ్మేళనంతో బీజేపీ బలమేంటో అర్థమైందన్నారు. ప్రధాని మోదీ కూడా పోలింగ్ బూత్ అధ్యక్షుడిగా చేశారని తెలిపారు. తమ పార్టీకి మూల స్తంభం పోలింగ్ బూత్ స్థాయి కమిటీలేనని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ పోలీంగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం నిర్వహించింది. హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొని సరల్ యాప్‌ను ప్రారంభించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు.

“మరో 6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు. కేంద్రం నిధులపై తెలంగాణ సర్కార్‌ తప్పుడు ప్రచారం చేస్తోంది.. కేంద్రం నిధులపై సీఎం కేసీఆర్‌తో చర్చకు సిద్ధం. రాజకీయాలు కాదు. అభివృద్ధి గురించి మాట్లాడండి.” – బండి సంజయ్

Read more RELATED
Recommended to you

Latest news