సీఎం KCR…మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు – బండి సంజయ్‌

-

సీఎం KCR…మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నాడని బిజెపి ఎంపీ బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని బిజెపి ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ జట్టుగా బీజేపీని లక్ష్యంగా చేసుకున్నాయని విమర్శించారు.

తనకు వ్యతిరేకంగా చేసే ప్రచారాన్ని ఎవరు నమ్మరని చెప్పారు. నాగార్జునసాగర్ విషయంలో ఉద్దేశపూర్వకంగానే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. డిసెంబర్ 3 తారీక్ నాడు KCR…మాజీ ముఖ్యమంత్రి అవుతున్నావ్ రాసిపెట్టుకో అని హెచ్చరించారు. ఫాల్తూ రాజకీయాలు చేస్తున్నావ్…రాయల సీమ వెళ్లి రోజక్క పెట్టిన చేపల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్నావ్ అంటూ నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం జగన్‌తో కుమ్మక్కయ్యావు నీవు… ప్రజలు పిచ్చోళ్లు కాదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news