సీఎం కేసీఆర్ ను రూంలో వేసి…బలగం సినిమా చూపించాలి – బండి సంజయ్

-

సీఎం కేసీఆర్ ను రూంలో వేసి…బలగం సినిమా చూపించాలని బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ డిమాండ్‌ చేశారు. తన ఫోన్ కేసీఆర్ వద్ద ఉందని ఆరోపించారు. తన ఫోన్ కాల్ డేటా చూసి కేసీఆర్ ఆశ్చర్యపోయారని చెప్పుకొచ్చారు. పదో తరగతి పరీక్షా పత్రం లీక్‌ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే.. దీనిపై బండి సంజయ్ మాట్లాడారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తనకు కాల్స్ చేసిన విషయం చూసి కేసీఆర్ కు నిద్రపట్టడంలేదని బండి సంజయ్ వివరించారు. కాగా, తెలంగాణ హైకోర్టులో బండి సంజయ్ పిటిషన్ పై విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది. బండి సంజయ్ తన ఫోన్ అప్పగించడంలేదని, విచారణకు సహకరించడంలేదని ఏజీ కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం అఫిడవిట్ దాఖలు చేయాలని ఏజీకి సూచించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news