బీజేపీ అధికారంలోకి వస్తే..ధరణీతో పాటు కేసీఆర్ పథకాలు కొనసాగిస్తాం – బండి సంజయ్‌

-

బీజేపీ అధికారంలోకి వస్తే..ధరణీతో పాటు కేసీఆర్ పథకాలు కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ ప్రకటించారు. మేము అధికారంలోకి వస్తే కేసీఆర్ పథకాలు కొనసాగిస్తాం, ధరణి పోర్టల్ అలానే కొనసాగిస్తామని తాజాగా తెలిపారు బండి సంజయ్. బీజేపీ కి జిల్లా అధ్యక్షులు ఉన్నారు.. అసెంబ్లీ కన్వీనర్లు ఉన్నారు.. మండల కమిటీలు ఉన్నాయి.. బూత్ కమిటీలు ఉన్నాయని తెలిపారు.

కేసీఆర్, మోడీకి నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని.. కేసీఆర్ ప్రపంచంలో అత్యంత అవినీతి పరుడు అంటూ విరుచుకుపడ్డారు. మోదీ క్యాబినెట్ పై ఒక్క అవినీతి మరక లేదని.. కేసీఆర్ క్యాబినెట్ లో అవినీతి మరక లేని మంత్రి లేడని విమర్శలు చేశారు. కేసీఆర్ ఎం చేస్తున్నారు.. రోజు వారీ షెడ్యూల్ ఎందుకు బయటపెట్టడం లేదని.. నీతి అయోగ్ సమావేశానికి వెళ్లరు… ప్రధాని వస్తె కలవరంటూ ఆగ్రహించారు.మోదీ దోస్తీ అంటివి.. మోడీ నీకు(కేసీఆర్) ఎట్ల దోస్తీ అయ్యారు ? అని ఆగ్రహించారు బండి సంజయ్‌. బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీసి కాంగ్రెస్ ఇమేజ్ ను పెంచేందుకే కేసీఆర్ కుట్ర అని… అందులో భాగమే మోదీ దోస్త్ అంటూ జిమ్మిక్కులు అని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news