బీజేపీ సింగిల్ గానే పోటీ చేస్తుంది..ఎవరికీ డిపాజిట్లు కూడా రాకుండా చేస్తాం – బండి సంజయ్

-

బీజేపీ సింగిల్ గానే పోటీ చేస్తుంది..ఎవరికీ డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామని తేల్చి చెప్పారు బండి సంజయ్. ‘‘దారుస్సలాంలో కూర్చొని బీరాలు పలకడం కాదు… నిజంగా మీకు దమ్ముంటే, మొగోళ్లయితే తెలంగాణ అంతటా పోటీ చేయాలని ఐఎంఐకు ఛాలెంజ్‌ విసిరారు బండి సంజయ్‌. బీఆర్ఎస్ ను సంకలేసుకుని వస్తారో… కాంగ్రెస్ సహా గుంట నక్కల పార్టీలతో కలిసి పోటీ చేస్తారో చూద్దాం.. బీజేపీ సింహం. సింగిల్ గానే పోటీ చేస్తుంది. మీకు డిపాజిట్లు రాకుండా చేస్తాం’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎంఐఎం నేతలకు సవాల్ విసిరారు.

సొంతంగా బలపడకుండా ఇంకో పార్టీ బలపడాలని కోరుకునే ఎంఐఎం నాయకులు అధికారంలో ఉన్న పార్టీతో అంటకాగుతూ సొంత ఆస్తులను కాపాడుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ముస్లిం సమాజమే ఎంఐఎం పార్టీని చీత్కరిస్తోందన్నారు. బీజేపీ నాగుపాము, ఎంఐఎం ఉన్నన్ని రోజులు బీజేపీని అధికారంలోకి రానీవ్వబోమంటూ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై … బీఆర్ఎస్ చేతగాని పార్టీ. ఆ పార్టీ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని అర్ధమవుతోందన్నారు. ఎంఐఎంకు అధికారంలోకి రావాలనే ఆలోచన లేదు.. పైసలు సంపుకోవాలని చూస్తోందని విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news