వచ్చే ఎన్నికల్లో రాష్ట్రలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే : బండి

-

వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన బీజేపీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశంలో పాల్గొన కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక కామెంట్స్ చేసారు. నీతిగా నిజయితీగా మెంబర్షిప్ చేస్తే పార్టీ బీజేపీ పార్టీ.. నేను గెలిచాను అంటే మోడీ హవా తోనే. కార్యకర్తల సహకారం తో నేను గెలిచాను. ఇక రాష్ట్రం కాంగ్రెస్ పార్టీని తిట్టని వాళ్ళు లేరు.. BRSలో పోటీ చేసే వాళ్ళు లేరు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర లో అధికారం లోకి వచ్చేది బీజేపీనే అని తెలిపారు బండి.

దేశం లోనే అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ బీజేపీ. 8 మంది మహిళను మంత్రులను చేసిన పార్టీ బీజేపీ. మహిళలకు 33 శాతం రిజ్వేషన్లను ఇవ్వడం తో వారు పోటీ చేసే అవకాశం బీజేపీతోనే వచ్చింది. ఈ సారి బీజేపీ టార్గెట్ పాత బస్తీనీ స్వాధీనం చేసుకోవడమే. అయితే ప్రజలు బీజేపీ అంటున్నారు. మెంబర్షిప్ తీసుకోవడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కార్యకర్తలు వెళ్లి అడుగుతే చాలు మెంబర్షిప్ అయిపోతుంది అని బండి సంజయ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news