వైఎస్‌, చంద్రబాబు కన్నా కేసీఆర్‌ పాలన అద్భుతం – బండ్ల గణేష్‌

-

టాలీవుడ్‌ నిర్మాత బండ్ల గణేష్‌..సీఎం కేసీఆర్‌, ఆయన పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రముఖ తెలుగు న్యూస్‌ ఛానెల్‌ కు ఇటీవల బండ్ల గణేష్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్‌ మాట్లాడుతూ…వైఎస్‌, చంద్రబాబు కన్నా కేసీఆర్‌ పాలన అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.

తెలంగాణ నీటి సమస్య లేకుండా.. కాళేశ్వరం ప్రాజెక్టు ను కట్టారని, అలాగే.. తెలంగాణలో పంట విపరీతంగా పండుతోందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటేయకుండా తెలంగాణ ప్రజలు ఉండలేరని పేర్కొన్నారు. అద్భుతంగా కేసీఆర్‌ సర్కార్‌ పాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు.

అలాగే ఏపీ మంత్రి రోజాకు తెలుగు చిత్ర పరిశ్రమ సన్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. రెండు సార్లు ఓడిపోయి, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజాకు మంత్రి పదవి దక్కడం చాలా గ్రేట్‌ అని కొనియాడారు. మంత్రి పదవి చేపట్టిన రోజాకు తగిన సన్మానం చేయాల్సిన బాధ్యత తెలుగు చిత్ర పరిశ్రమపై ఉందని వివరించారు బండ్ల గణేష్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news