హైదరాబాద్ లో మరో దారుణం..బార్బర్ ను గొంతు కోసి హత్య !

-

రంగారెడ్డి నార్సింగీ లో దారుణం చోటు చేసుకుంది. రాజు అనే బార్బర్ ను అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. దీంతో 100 ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు స్థానికులు. అనంతరం హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న కాప్స్…దర్యాప్తు చేపట్టారు. ఇంతలోనే నిందితుడు లొంగిపోయాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. డిసెంబర్ 31 వ తేదీ వేసిన ముగ్గు తో రాజు, ప్రవీణ్‌ల మధ్య గొడవ జరిగింది.

రాజు కు ప్రవీణ్ కు అప్పటి నుండి కొనసాగుతున్నాయి విభేదాలు. గత ఆరు నెలల‌‌ క్రితం ప్రవీణ్ తో పాటు అతని తల్లి పై నార్సింగీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు రాజు. అదే మనస్సులో ఉంచుకొని సెలూన్ లో ఉన్న రాజును కత్తితో గొంతు కోసి హత్య చేశాడు ప్రవీణ్. హత్య చేసిన కత్తి తో ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్ కు వెళ్ళి లొంగిపోయాడు ప్రవీణ్. ఇక ప్రవీణ్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news