యాదాద్రిలో మంత్రి పువ్వాడ అజయ్ పై తేనెటీగల దాడి

-

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఊహించని పరిణామం ఎదురైంది. యాదాద్రి ఆలయం పున ప్రారంభం సందర్భంగా… జరిగిన మహా కుంభ సంప్రోక్షణ లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. అయితే ఈ తరుణంలోనే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై తేనెటీగలు దాడి చేశాయి.

ఆలయ పంచ తల గోపురంపై పూజా క్రతువు తో ఉన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పూజారులు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది పైన తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగలు దాడి చేసినప్పటికీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మహాకుంభ సంప్రోక్షణ పూజా కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాతే అక్కడి నుంచి లేచారు. ఇక అనంతరం ప్రాథమిక చికిత్స కొరకు పూజ క్రతువును ముగించుకున్న తర్వాత మంత్రి అజయ్ కుమార్ హైదరాబాద్ బయలుదేరారు. కాగా రెండు రోజుల కింద షర్మిలా పైన కూడా తేన తీగలు దాడి చేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news