పివి నరసింహారావుకు భారత రత్న..కేసీఆర్‌ హర్షం

-

PV నరసింహరావుకు అరుదైన గౌరవం దక్కింది. PV నరసింహరావుకు భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ప్రధాని మోడీ సోషల్‌ మీడియాలో ప్రకటించారు. PV నరసింహరావుకు భారతరత్న ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు ప్రధాని మోడీ.

అయితే.. తెలంగాణ బిడ్డ, భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు దేశ అత్యన్నత పురస్కారం భారత రత్న దక్కడం పట్ల బిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా కేసీఆర్ పేర్కొన్నారు. పీవీ కి భారత రత్న ప్రకటించాలని బిఆర్ఎస్ పార్టీ చేసిన డిమాండ్ ను గౌరవించి పీవీ నరసింహారావు కు భారత రత్న ఇవ్వడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news