రేవంత్ రెడ్డి, చంద్రబాబు సంబంధంపై భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు !

-

రేవంత్ రెడ్డి, చంద్రబాబు సంబంధంపై భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు.  రేవంత్ రెడ్డికి చంద్రబాబు గురువు కాదు కేవలం సహచరుడు మాత్రమే అంటూ తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి చెప్పిన బూతు మాట నేను అనలేను అని వెల్లడించారు.

Bhatti Vikramarka’s sensational comments on the relationship between Revanth Reddy and Chandrababu

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమంత్రి అమిత్ షాను కలిశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గోదావరి పరిసరాల్లోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని కోరామన్నారు. వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులను కేటాయించాలని కోరామన్నారు. ఇంకా.. రాష్ట్రానికి IIM ఇవ్వాలని ప్రధాని మోదీని కోరామన్నారు. ఇంకా ఐటీఆర్‌ ప్రాజెక్టును పునరుద్ధరించాలని అడిగారు.

ఇంకా.. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేయాలని ప్రధానిని కోరామన్నారు. ఇంకా భద్రాచలం సమీపంలో ఏపీలో విలీనం చేసిన 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని కోరినట్లు చెప్పారు. ఇంకా 29 మంది ఐపీఎస్ అధికారులను తెలంగాణకు కేటాయించాల్సి ఉందని ప్రధానికి తెలిపామన్నారు. ఈ కేటాయింపు త్వరలో పూర్తి చేయాలని కోరినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news