తెలుగు ప్రజలకు బిగ్ అలర్ట్.. మూడు రోజులపాటు భారీగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగనున్నాయి. తెలంగాణలో రానున్న మూడు రోజులు పగటిపూట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/05/Big-alert-for-Telugu-people-Heavy-temperatures-for-three-days.png)
నేడు, రేపు 40-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని పేర్కొంది.అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలోనూ మరో నాలుగు ఐదు రోజులు ఎండలు, వడగాలులు కొనసాగుతాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు మూడు, నాలుగు రోజుల్లో కేరళలోకి ప్రవేశించనున్నాయి.