ఎమ్మెల్సీ ఉపఎన్నికలో పోలింగ్ నమోదు ఎంత శాతం అయ్యిందంటే ..?

-

ఉమ్మడి ఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యు యేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో 72.44శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. 4,63,839 మంది గ్రాడ్యుయేట్లకు గానూ 3,36,013 మంది నిన్న జరిగిన ఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వెల్లడించింది.

 

కాగా, ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమై సరిగ్గా సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఈ 3 ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలింగ్ జరగ్గా.. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉండనుంది.ఈ ఎన్నికలో నోటా ఆప్షన్ ఉండదు.3 జిల్లాల్లో కలిపి 4,63,839 మంది ఓటర్లు ఉండగా మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నిక బ్యాలట్ పేపర్ ద్వారా నిర్వహించారు. ఎన్నికల బరి లో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. దీంతో పెద్ద సైజు బ్యాలెట్ పేపర్ ,జంబో బ్యాలెట్ బాక్సులను వినియోగించారు.3000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ఒక పోలింగ్ కేంద్రంలో సగటున 800 మంది ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news