మంత్రి కేటీఆర్‌ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన పద్మా వెంకట్ రెడ్డి దంపతులు

-

గ్రేటర్‌ హైదరాబాద్‌ లో బీజేపీకి మరో షాక్‌ తగిలింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు పద్మా వెంకట్ రెడ్డి దంపతులు. బీజేపీకి బాగ్‌ అంబర్‌పేట్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ పద్మా వెంకట్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ తరుణంలోనే మంత్రి కేటీఆర్‌ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు పద్మా వెంకట్ రెడ్డి దంపతులు. ఇది ఇలా ఉండగా…కడియం శ్రీహరికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జై కొట్టారు.

BJP corporator Padma Venkat Reddy joined BRS party in the presence of Minister KTR
BJP corporator Padma Venkat Reddy joined BRS party in the presence of Minister KTR

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టేషన్ ఘనపూర్ అభ్యర్ధిగా కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్లను మొన్న సీఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఏకంగా 115 అసెంబ్లీ టికెట్లను ప్రకటించారు సీఎం కేసీఆర్‌.

అయితే.. ఈ లిస్ట్‌ లో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేరు గల్లంతు అయింది. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే టికెట్‌ను కడియం శ్రీహరికి ఇచ్చారు సీఎం కేసీఆర్‌. గత కొన్ని రోజులుగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై వస్తున్న ఆరోపణలు.. సర్పంచ్‌ నవ్య వివాదం తరుణంలోనే…. ఆయనకు టికెట్‌ ఇవ్వకుండా… స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే టికెట్‌ను కడియం శ్రీహరికి ఇచ్చారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news