దీపావళి తరువాత బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో..!

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేందుకు బీజేపీకి అవకాశం ఉందని కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. దీపావళి పండుగ తరువాత బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నట్టు తెలిపారు. బీజేపీ అగ్రనేతలు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు అని వెల్లడించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు.

బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అంటున్నారు. ఎంఐఎం పార్టీతో బీజేపీ కలిసే అవకాశమే లేదు అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీజేపీపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయి. మజ్లిస్ పార్టీలతో కలిసి లాభపడింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం అయిందని తెలిపారు. కేవలం ఐదు నెలల్లోనే కర్ణాటకను కాంగ్రెస్ భ్రష్టు పట్టించిందని విమర్శించారు కిషన్ రెడ్డి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి నష్టమని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version