BJP-Janasena : బీజేపీ-జనసేన పొత్తు ఖరారు…8 స్థానాల్లో పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి బిజెపి-జనసేన పొత్తు ఖరారైంది. జనసేనకు 8 సీట్లు ఇచ్చేందుకు బిజెపి అంగీకరించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, అశ్వరావుపేట, మధిర, వైరా, కొత్తగూడెంతో పాటు నాగర్ కర్నూల్, కోదాడ, కూకట్పల్లి స్థానాలను కేటాయించింది. అయితే షేరిలింగంపల్లి సీటు కోసం జనసేన పట్టుబడుతుండగా….బిజే పి ససేమిరా అంటుంది. దీనిపై రేపటి లోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

BJP-Janasena alliance finalized

ఇక ఈ తరుణంలోనే.. ఈ నెల 7న తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ఈ సందర్భంగా బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొంటారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే.. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఈ నెల 7న జరగనున్న బీసీ ఆత్మగౌరవ సభకు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా పాల్గొంటుండగా… బిజెపి నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు పవన్ ను కూడా ఆహ్వానించారు. అందుకు ఆయన అంగీకరించారు.

Read more RELATED
Recommended to you

Latest news