తాను పార్టీ మారడం లేదు.. స్పందించిన బీజేపీ నేత గడ్డం వివేక్

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న కొద్ది కొంత మంది పార్టీలు మారుతున్నారు. ఇటీవలే మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసి బీజేపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా రాజ్ గోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం.

రాజ్ గోపాల్ రెడ్డి ఎల్లుండి ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అయితే రాజ్ గోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ రెండు రోజులుగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. గడ్డం వివేక్ కూడా పార్టీ మారనున్నట్టు వార్తలు వినిపించడంతో తాజాగా ఆయన స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తెలిపారు. తాను పార్టీ మారడం లేదని.. బీజేపీ అభ్యర్థిగా పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన విషయమే నాకు తెలియదని వివేక్ చెప్పడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version