హిందువులపై బీజేపీ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు..!

-

బీజేపీ ఎమ్మెల్యే పైడి రాఖేష్ రెడ్డి హిందువులపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదస్పదంగా మారాయి. తాజాగా ఆయన హిందువుల్లో మగతనం చనిపోయింది.. సిగ్గు శరం లేని హిందువుల జాతి హైదరాబాద్ లోనే ఉంది. హిందువుల రక్తం మరిగినప్పుడే హిందూ దేవుళ్లపై దాడులు జరగవు. ఒక్క హిందువు కూడా మసీదుపై దాడి చేయడం లేదు ఎందుకు ? అని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

హిందువులు చీము, నెత్తురు లేని నా కొడుకులు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు హిందు ‘దేవతా విగ్రహాల ధ్వంసం జరిగిన సందర్భంలో పోలీసులు పిచ్చోళ్ళను నిందితులుగా
చూపుతున్నారని, అలాగైతే నగరంలో ఉన్న లక్ష మంది హిందూ పిచ్చోళ్ళు మసీద్ లపై ఎందుకు దాడి చేయడం లేదని నిలదీశారు. ఆలయాలపై దాడులను ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని
ఆరోపించారు. ఇతర మతస్తులకు, ముఖ్యంగా ఒవైసీ సోదరులు ఆలయాలపై దాడులను
ప్రోత్సహించకుండా చోరవ తీసుకుని మత సామరస్యాన్ని కాపాడాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news