ఈ నెల 5న తెలంగాణకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

-

తెలంగాణలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నేపథ్యంలో.. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఈ నెల 5న మహబూబ్ నగర్ కి రానున్నారు. స్థానిక (ఎం వి ఎస్) కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటున్నారు. దీంతో ఈ సభను సక్సెస్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు బీజేపీ నేతలు. ఇందుకోసం భారీ జన సమీకరణ చేస్తున్నారు. బహిరంగ సభ నిర్వహణపై బండి సంజయ్ అధ్యక్షతన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి లతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ నేతలతో చర్చించారు. గత 18 రోజులుగా బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర తీరు తెన్నులు, ప్రజల స్పందన పైన చర్చించారు. పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోందని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యారు అన్నారు. ఈసారి అధికారంలోకి వచ్చేది బీజేపీ అనే భావన ప్రజలలో ఏర్పడిందన్నారు. ఈ నెల 5న జరిగే బహిరంగ సభను సక్సెస్ చేసి సత్తా చాటాలి అన్నారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news