ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిఎల్ సంతోష్ స్టే పొడిగింపు

-

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిజెపి నేత బిఎల్ సంతోష్, తుషార్ లకు ఇచ్చిన 41 నోటీస్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. స్టే గడువు నేటితో ముగియడంతో తిరిగి పొడిగించాలని సంతోష్ తరపు న్యాయవాది కోరారు. విచారణ జరిపిన న్యాయమూర్తి తొలుత రెండు వారాల గడువు ఇచ్చేందుకు అంగీకరించారు.

అయితే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ప్రభుత్వ ఆపిల్ పిటిషన్ పై విచారణ పెండింగ్ లో ఉందన్న విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. విచారణ పూర్తి అయ్యేందుకు మరింత సమయం పడుతుందని ధర్మాసనం దృష్టికి తీసుకురావడంతో హైకోర్టు స్టే ని ఆరు వారాలకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news