శామీర్ పేట్ ఆత్మహత్యలో సంచలన విషయాలు..!

-

శామీర్ పేట చెరువులో తన ఇద్దరు పిల్లలతో కలిసి దూకిన తల్లి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది. అయితే నిన్న ఇద్దరి పిల్లల మృతదేహాలు వెలికితీసిన పోలీసులకు ఈ రోజు ఆ మహిళ మృతదేహం లభ్యం అయ్యింది. అయితే మరణించిన వారు సిద్దిపేట జిల్లా ములుగు కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. మృతులు భానుప్రియ, ఆనంద్ (5) దీక్ష(4). కుటుంబ కలహాల కారణంగానే పిల్లల్ని చంపి భానుప్రియ ఆత్మహత్యకు పాల్పడింది అని అనుకున్నారు.

అయితే ఈ ఆత్మహత్యలో సంచలన విషయాలు బయట పడుతున్నాయి. పిల్లల్లో నాలుగేళ్ల చిన్నారి దీక్షకు పుట్టుకతోనే క్యాన్సర్ ఉంది. దీనికి తోడు పేదరికం. హాస్పిటల్స్ లో చూపించే స్థోమత లేక కుటుంబం సతమతం అయ్యింది. దాంతో భార్య భర్తల మధ్య తరచూ తగాదాలు జరిగాయి. ఈ క్రమంలో భార్య భానుప్రియ పై భర్త చేయి చేసుకున్నాడు. అందువల్ల మనస్తాపానికి లోనై.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది భానుప్రియ.

Read more RELATED
Recommended to you

Latest news