బ్రేకింగ్: శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో మళ్ళీ పేలుడు

-

శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో మరోసారి భారీ పేలుడు సంభవించింది. విద్యుత్ కేబుల్ పై నుంచి డీసిఎం వాన్ వెళ్ళడంతో షార్ట్ సర్క్యూట్ అయింది. ఈ క్రమంలో భారీగా మంటలు చెలరేగాయి. దీనితో భారీ శబ్దాలతో మంటలు ఎగసి పడ్డాయి. అక్కడి నుంచి విద్యుత్ ఉద్యోగులు పరుగులు తీసారు. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

పది రోజుల క్రితం జరిగిన ఇదే విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 9 మంది ఉద్యోగులు ప్రాణాలు విడిచారు. దీనిపై తెలంగాణా సర్కార్… సిఐడి విచారణకు ఆదేశించింది. విచారణ జరుగుతున్న క్రమంలోనే ఈ పేలుడు సంభవించింది అని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరూ గాయపడలేదు. మంటలను సిబ్బంది అదుపు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news